www.ntodaynews.com
అయోధ్య రామమందిర విరాళాల వివాదం.. సీసీటీవీ దృశ్యాలు ట్యాంపరింగ్ ఆరోపణలు..!
జాతీయం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య రామమందిరంకు అందిన విరాళాలు, కానుకల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగుతోంది.
తాజా దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సాక్ష్యాలు దాచేందుకు ఆలయంలోని సీసీటీవీ కెమెరాల రికార్డులను ట్యాంపర్ చేసినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
విరాళాల నిర్వహణలో పారదర్శకతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దర్యాప్తు మరింత వేగవంతం చేసినట్లు సమాచారం.