బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు
బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు
తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి వివిధ హోదాల్లో చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు.
తిరువూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పల్లెపాటి శ్రీనివాసరావు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు ప్రకాశరావు, పట్టణ అధ్యక్షుడు జీవన్ బాబు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ సేవలను కొనియాడారు. సమాజానికి చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంజా కృష్ణమోహన్, ఇజ్జాడ జగన్నాథం, చిన్నంశెట్టి నాగేశ్వరావు, జీడిమల్ల బాలు, చావల రంగయ్య, చక్రాల హరిబాబు, కొత్తగుండ్ల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.