బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు
NTODAYNEWS నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో శుక్రవారం ఒక నివాస గృహంలో అగ్నిప్రమాదం తప్పింది. స్థానిక బాధితుడు పాకాల ఐలయ్య నివాసంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల వ్యవధిలోనే ఇల్లంతా వ్యాపించాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం అందించి, పరిస్థితి తీవ్రతను వివరించారు. ప్రమాద సంఘటన తెలుసుకున్న నాయకులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఫైర్ ఇంజన్ను త్వరగా రప్పించడం వల్లే చుట్టుపక్కల ఇళ్లకు మంటలు వ్యాపించకుండా పెద్ద ప్రమాదం తప్పిందని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కాగా, ప్రమాదానికి గురైన బాధితులకు ప్రభుత్వం తరపున, వ్యక్తిగతంగా తగిన సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా నాయకులు హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, కౌన్సిలర్లు బొబ్బిలి సందీప్ రాంరెడ్డి, కుక్కల మోహన్, ఏర్పుల పరమేష్, దేశపాక లత రాజేష్, అలాగే నాయకులు పాటి దివాకర్ రెడ్డి, అమరోజు మదన్ తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి ఓదార్చారు.