www.ntodaynews.com
సి. గుడిపాడులో బడి పిలుస్తోంది కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
బడి పిలుస్తోంది కార్యక్రమం సి. గుడిపాడులో విజయవంతంగా నిర్వహణ
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం సి. గుడిపాడు గ్రామం లో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో "బడి పిలుస్తోంది" కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఇందులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సి. గుడిపాడు విద్యార్థులతో ర్యాలీ ప్రారంభించారు. మండల విద్యాశాఖాధికారి 1 మాసగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చేరికను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో విద్యార్థులకు ప్రేరణ ఇచ్చారు.
వారు, "ప్రభుత్వ పాఠశాలలు మరింత మెరుగైన విద్య, సమగ్ర అభివృద్ధి అందిస్తాయి. అందుకే ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి" అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అంగిడి బక్కయ్య మరియు ఉపాధ్యాయులు విద్యార్థుల చొరవను ప్రశంసించారు.