BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఇరు పార్టీలతో కాణిపాకం వినాయకుడు దగ్గర ప్రమాణానికి సిద్ధం..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
18 Mar, 2026 - 02:32 PM
108 వీక్షణలు

 ‘బీ టీమ్’ అని నిరూపిస్తే, ఇరు పార్టీలతో కాణిపాకం వినాయకుడు దగ్గర ప్రమాణానికి సిద్ధం..

జనసేన పార్టీ జనసైనికులు మా అధినాయుకుడి వెంట తిరిగినది మరిచారా..

ఇకపై ఏ పార్టీ నాయకులు ఐన మా బిసివై పార్టీ అధినాయకుడు బోడె రామచంద్ర యాదవ్ వారి పై మాట్లాడితే సరి ఐనా రీతిలో బుద్ది చెబుతాం..

బీసీవై కన్వీనర్ ఎద్దుల హరిబాబు యాదవ్

పుంగనూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక కూటమి, జనసేన నాయకులు అవాస్తవ ఆరోపణలకు దిగుతున్నారని బీసీవై కన్వీనర్ ఎద్దుల హరిబాబు యాదవ్  తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మా పార్టీ ఎవరికి ‘బీ టీమ్’ అని నిరూపిస్తే, మీ ఇరు పార్టీలు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సాక్షిగా 365 రోజులు 24 గంటల్లో ఎప్పుడైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని సవాల్ విసిరారు.

అలాగే పుంగనూరు నియోజకవర్గంలో జనసేన కూటమి నాయకులు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి కి ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని బీసీవై పార్టీ ఆధారాలతో మీడియా మిత్రులకు చూపించారు. ప్రజలను మోసం చేసే రాజకీయాలకు బీసీవై పార్టీ ఎప్పటికీ లొంగదని, నిజాయితీతో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీవై నాయకులు కుమ్మర గిరిబాబు (సోషల్ మీడియా), వెంకటేష్ యాదవ్, శంకర్ , మంజునాథ్ రెడ్డి (రాప్తాడు నియోజకవర్గం కన్వీనర్), గంగరాజు, జ్ఞానేంద్ర, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.