ఇరు పార్టీలతో కాణిపాకం వినాయకుడు దగ్గర ప్రమాణానికి సిద్ధం..
‘బీ టీమ్’ అని నిరూపిస్తే, ఇరు పార్టీలతో కాణిపాకం వినాయకుడు దగ్గర ప్రమాణానికి సిద్ధం..
జనసేన పార్టీ జనసైనికులు మా అధినాయుకుడి వెంట తిరిగినది మరిచారా..
ఇకపై ఏ పార్టీ నాయకులు ఐన మా బిసివై పార్టీ అధినాయకుడు బోడె రామచంద్ర యాదవ్ వారి పై మాట్లాడితే సరి ఐనా రీతిలో బుద్ది చెబుతాం..
బీసీవై కన్వీనర్ ఎద్దుల హరిబాబు యాదవ్
పుంగనూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక కూటమి, జనసేన నాయకులు అవాస్తవ ఆరోపణలకు దిగుతున్నారని బీసీవై కన్వీనర్ ఎద్దుల హరిబాబు యాదవ్ తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మా పార్టీ ఎవరికి ‘బీ టీమ్’ అని నిరూపిస్తే, మీ ఇరు పార్టీలు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సాక్షిగా 365 రోజులు 24 గంటల్లో ఎప్పుడైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని సవాల్ విసిరారు.
అలాగే పుంగనూరు నియోజకవర్గంలో జనసేన కూటమి నాయకులు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి కి ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని బీసీవై పార్టీ ఆధారాలతో మీడియా మిత్రులకు చూపించారు. ప్రజలను మోసం చేసే రాజకీయాలకు బీసీవై పార్టీ ఎప్పటికీ లొంగదని, నిజాయితీతో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీవై నాయకులు కుమ్మర గిరిబాబు (సోషల్ మీడియా), వెంకటేష్ యాదవ్, శంకర్ , మంజునాథ్ రెడ్డి (రాప్తాడు నియోజకవర్గం కన్వీనర్), గంగరాజు, జ్ఞానేంద్ర, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.