బీజేపీ యాదాద్రి భువనగిరి ధార్మిక (ఎండోమెంట్) సెల్ జిల్లా అధ్యక్షులుగా సురకంటి జంగారెడ్డి
బీజేపీ యాదాద్రి భువనగిరి ధార్మిక (ఎండోమెంట్) సెల్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన సురకంటి జంగారెడ్డి కి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా శాలువా కప్పి ఘనంగా సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా చందా మహేందర్ గుప్తా మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి సురకంటి జంగారెడ్డి సమర్థవంతంగా సేవలందించి, ధార్మిక రంగంలో బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భువనగిరి సదానందం గౌడ్ , రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బోయపల్లి గోపాల్ రెడ్డి , సీనియర్ రాష్ట్ర నాయకులు కొలన్ లక్ష్మారెడ్డి , జిల్లా ఓబీసీ కార్యదర్శి పసలాది రామచందర్ , ముస్కే సుధాకర్ రెడ్డి , సంకూరి శ్రీకాంత్ , బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గూడూరు శ్రీనివాస్ రెడ్డి , మండల కోశాధికారి పాదం గణేష్ రావు , వార్డ్ సభ్యులు ఎరుకల శ్రీకాంత్ యాదవ్ , భూత్ అధ్యక్షులు బర్మా గణేష్ , జల్లి సాయి దత్త,అభిలాష్ , పసలాది శ్రీకాంత్ , దుంప శ్రీధర్ , కవాడి నాగరాజు,ధరావత్ నరేందర్ నాయక్ , సోషల్ మీడియా ఇన్చార్జ్ నకీర్తి శ్రీకాంత్ తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సురకంటి జంగారెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు.