బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కిట్లు పంపిణీ
బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాగినేనిపల్లి గ్రామంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు రామిడి జంగారెడ్డి
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా,బొమ్మలరామారం మండలం,నాగినేనిపల్లి గ్రామంలో బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామిడి జంగారెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం శాంతి, సౌభ్రాతృత్వం, సేవా భావానికి ప్రతీక అని తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు పేద కుటుంబాలకు ఉపవాస దినాల్లో ఉపయోగపడే విధంగా ప్రభుత్వం మరియు నాయకులు ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందని అన్నారు.ప్రతి వర్గం ప్రజలు సంతోషంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ముస్లిం సోదరులు ఉపవాసాలు విజయవంతంగా పూర్తి చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భోగ కల్పన వెంకటేష్, మచ్చ రామచందర్, రామిడి బుచ్చిరెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు