బీసీ డిమాండ్ల సాధనకై 24 గంటల నిరవధిక దీక్ష
బీసీ డిమాండ్ల సాధనకై 24 గంటల నిరవధిక దీక్ష
మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్కులో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు. దీక్షలో కూర్చున్న నాయకులకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
ప్రధాన డిమాండ్లు
కేంద్ర ప్రభుత్వం
పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి, చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలి.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలోనే బీసీల రక్షణ కోసం 'బీసీ యాక్ట్' రూపొందించాలి.
కేంద్రంలో ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి.
ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్లను రద్దు చేసి, 50% సీలింగ్ రిజర్వేషన్ ఎత్తివేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం:
ఎన్నికల సమయంలో ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ మరియు మేనిఫెస్టోలోని అంశాలను తక్షణమే అమలు చేయాలి.
ప్రత్యేకంగా బీసీ సబ్ ప్లాన్ మరియు ఎంబీసీ (MBC) మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి.
బీసీ సంక్షేమం కోసం లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్న హామీని నెరవేర్చాలి.
డాక్టర్ జెవి రాజు - న్యూ ఇండియా పార్టీ అధ్యక్షులు
పెద్దంపేట శంకర్ - రాష్ట్ర అధ్యక్షులు, బీసీ ఐక్య సంఘర్షణ సమితి
వెన్నెల నరసయ్య - జిల్లా అధ్యక్షులు, తెలంగాణ గంగపుత్ర సంఘం
డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్ - రాష్ట్ర ఉపాధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం
గుమ్ముల శ్రీనివాస్ - జిల్లా అధ్యక్షులు
కర్రె లచ్చన్న - సీనియర్ నాయకులు, న్యాయవాది
గజ్జెల్లి వెంకటయ్య, వేముల అశోక్, రామగిరి రాజన్న చారి, కొత్తకొండ రమేష్ మంచెర్ల సదానందం చంద్రగిరి చంద్రమౌళి,కీర్తి బిక్షపతి, ఎర్రోళ్ల రాజు, సురేంద్ర చారి శెట్టిపల్లి ఘట్టయ్య
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా నాయకులు ప్రభుత్వాలను హెచ్చరించారు