BREAKING
సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

​బెల్లంపల్లిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య

తెలంగాణ
/ మంచిర్యాల / బెల్లంపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
03 Jun, 2026 - 07:44 PM
45 వీక్షణలు

అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనుల పరిశీలన

బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మున్సిపల్ చైర్‌పర్సన్ స్వాతి, కమిషనర్ రమేష్, తహసిల్దార్ కృష్ణలతో కలిసి పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. అమృత్ 2.0 పనులలో వేగం పెంచాలని, అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేసి పెండింగ్ అంశాలను వెంటనే పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.

​పట్టణ పరిశుభ్రతను మెరుగుపర్చేందుకు ప్రతిపాదిత నూతన డంపింగ్ యార్డ్ స్థలాన్ని పరిశీలించి, ఆధునిక ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్, పాత డంపింగ్ యార్డ్ భూ సమస్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, మార్కెట్ యార్డ్‌లోని ఆక్రమణలను చట్టపరమైన చర్యల ద్వారా తొలగించి ప్రజా అవసరాల స్థలాలను విముక్తం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని సమీక్షిస్తూ, మంజూరైన బిల్లుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

​ఇదే పర్యటనలో బెల్లంపల్లి ఈఆర్‌ఓ (ERO) హోదాలో తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 'ఎన్నికల హెల్ప్ డెస్క్'ను అదనపు కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఎన్నికల పర్యవేక్షకులతో సమీక్ష సమావేశం నిర్వహించి.. ఓటరు జాబితాల నిర్వహణ, దరఖాస్తుల పరిష్కారంలో పూర్తి పారదర్శకత పాటించాలన్నారు. ప్రజలకు ఎన్నికల సేవలు సులభంగా అందించడంలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజినీరింగ్ సిబ్బంది, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు