www.ntodaynews.com
ఈతకు వెళ్ళి తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి
తెలంగాణ
/
మంచిర్యాల
/
బెల్లంపల్లి
బెల్లంపల్లిలో విషాదం: ఈతకు వెళ్ళి తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి
బెల్లంపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కొల్లూరి రాజేష్ (15) అనే విద్యార్థి, తన స్నేహితులతో కలిసి తాళ్లగురిజాల గ్రామ శివారులోని కుంటలో ఈతకు వెళ్ళి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. రాజేష్ ఈత రాక నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించగా, ఈఎంటీ దుర్గం కిష్టయ్య మరియు పైలట్ ఒద్దిరాజేశం ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి