www.ntodaynews.com
బజ్జీలు తిని 90 మందికి అస్వస్థత
ఆంధ్రప్రదేశ్
/
తూర్పు గోదావరి
తూర్పుగోదావరి జిల్లా దుగ్గుదూరు గ్రామంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. రహదారి పక్కన బండిపై విక్రయిస్తున్న బజ్జీలు తిన్న సుమారు 90 మంది అస్వస్థతకు గురయ్యారు.
బజ్జీలు తిన్న కొద్దిసేపటికే బాధితులకు వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న వైద్య, రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఫుడ్ పాయిజన్కు కారణాలపై విచారణ చేపట్టడంతో పాటు బజ్జీ నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.