www.ntodaynews.com
బోగోలు గ్రామంలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
బోగోలు గ్రామంలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం బోగోలు గ్రామంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గ్రామ పార్టీ అధ్యక్షులు బొంతు గిరిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమానికి టీడీపీ మండల అధ్యక్షులు గరిమెళ్ల చలపతిరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా వెంకటాపురంలో కొత్తగా నిర్మించిన పార్టీ జెండా దిమ్మను, పార్టీ లోగోను ఆవిష్కరించి, తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు.
ఈ వేడుకల్లో మాజీ ఎంపీటీసీ సభ్యులు వేంపాటి సత్యనారాయణ, పార్టీ నాయకులు రాము తదితరులతో పాటు అధిక సంఖ్యలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.