చెన్నా రావు ఆధ్వర్యంలో ప్రోత్సాహక నగదు బహుమతుల పంపిణీ
బూరుగుగూడెం ఎంపీయుపీ పాఠశాల నందు అంగిడి చెన్నా రావు ఆధ్వర్యంలో ప్రోత్సాహక నగదు బహుమతుల పంపిణీ
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం ఎంపీ యుపి పాఠశాల బూరుగుగూడెం నందు 1వ తరగతి నుంచి 8వ తరగతులకు చెందిన క్లాస్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు,1వ తరగతి నుంచి 8వ తరగతులకు చెందిన హాజరు నందు ప్రధమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు, లాంగ్వేజ్ ఫెస్టివల్ నందు ఏలూరు వరకు వెళ్ళి ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థునులకు మరియు ఎంఆర్సీ చాట్రాయి వారి అధ్వర్యంలో నిర్వహించిన (రాజ్యాంగ దినోత్సవం) నందు ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు Pay Back to Society(సమాజానికి తిరిగి చెల్లించడం) అన్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ స్పూర్తి తో మరియు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపడుతున్న పలు సంస్కరణల స్పూర్తి తో ఎంపీయుపీ పాఠశాల బూరుగుగూడెం కు చెందిన అంగిడి.చెన్నారావు(స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్) తన సొంత నిధులతో పాఠశాలకు చెందిన విద్యార్థులకు 21 నగదు బహుమతులను "చిరు ప్రోత్సాహక నగదు బహుమతుల రూపంలో" ఇవ్వటం జరిగింది.