www.ntodaynews.com
బోరవంచ BPL సీజన్-2 విజేతలకు బహుమతులు అందజేత
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
బోరవంచ BPL సీజన్-2 విజేతలకు బహుమతులు అందజేసిన మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
ఏలూరు జిల్లా నూజివీడు మండలం బోరవంచ గ్రామ యువత ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు జరిగిన BPL సీజన్-2 ఫైనల్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఫైనల్లో విజేతగా నిలిచిన బోరవంచ క్రికెట్ జట్టుకు నూజివీడు మాజీ శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రథమ బహుమతిని అందజేశారు.
ఈ సందర్భంగా యువత క్రీడల్లో రాణిస్తూ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించిన గ్రామ యువతను అభినందించారు.