www.ntodaynews.com
బస్సులో విషాదం.. బ్రేక్ వేయడంతో కిందపడి మహిళ మృతి
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం
ఏ కొండూరు మండలం క్రాస్ రోడ్డు సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది.
విజయవాడ నుంచి తిరువూరు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందింది.
బస్సు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఆమె కిందపడినట్లు సమాచారం.
మృతురాలిని విసన్నపేట మండలం పుట్రెల గ్రామానికి చెందిన శీలం లక్ష్మిగా గుర్తించారు.
ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.