BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 01 October 2024, 11:40 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

శ్రీ కాకతీయ స్కూల్లో బతుకమ్మ సంబరాలు

తెలంగాణ
01 Oct, 2024 - 11:40 PM
383 వీక్షణలు
ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి - కుర్మతి రమేష్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కేంద్రంలోని గుజ్జ గ్రామపంచాయతీ పరిధిలో మండల కేంద్రంలోని శ్రీ కాకతీయ స్కూల్ విద్యాసంస్థలో ఆ విద్యాసంస్థ చైర్మన్ జ్యోతి శ్రీనివాస్, ఇంచార్జ్ వీరమల్ల నవీన్ కుమార్, ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాల్లో విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆ విద్యాసంస్థ ప్రిన్సిపాల్ రాజు మాట్లాడుతూ.. పండుగలు మత సామరస్యానికి ప్రతీకలని, ఐక్యతకు నిదర్శనమని అన్నారు. సహజ సిద్ధంగా దొరికే రంగురంగుల పూలతో బతుకమ్మను నిర్వహిస్తారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మను ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుందని వారు అన్నారు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. అనంతరం బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థిని విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయులు ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొని రంగురంగుల తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, పాఠశాల ప్రాంగణంలో ఆటపాటలతో బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. అనంతరం బతుకమ్మలను ముత్యాలమ్మ దేవాలయ సమీపంలో గల పుష్కరిణిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాకతీయ స్కూల్ ఉపాధ్యాయులు కళ్యాణి, సంతోష, మాధవి, నందిని, గిరిజ, ప్రియాంక, నాగబాల, అశ్విని విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.