BREAKING
టమాట పది రూపాయలు మహిళా బిల్లును అడ్డుకుంటున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతాం అత్యవసర హెచ్చరిక జారీ చేయబడింది… ​తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి టమాట పది రూపాయలు మహిళా బిల్లును అడ్డుకుంటున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతాం అత్యవసర హెచ్చరిక జారీ చేయబడింది… ​తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి
www.ntodaynews.com

శ్రీ కాకతీయ స్కూల్లో బతుకమ్మ సంబరాలు

తెలంగాణ
01 Oct, 2024 - 11:40 PM
233 వీక్షణలు
ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి - కుర్మతి రమేష్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కేంద్రంలోని గుజ్జ గ్రామపంచాయతీ పరిధిలో మండల కేంద్రంలోని శ్రీ కాకతీయ స్కూల్ విద్యాసంస్థలో ఆ విద్యాసంస్థ చైర్మన్ జ్యోతి శ్రీనివాస్, ఇంచార్జ్ వీరమల్ల నవీన్ కుమార్, ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాల్లో విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆ విద్యాసంస్థ ప్రిన్సిపాల్ రాజు మాట్లాడుతూ.. పండుగలు మత సామరస్యానికి ప్రతీకలని, ఐక్యతకు నిదర్శనమని అన్నారు. సహజ సిద్ధంగా దొరికే రంగురంగుల పూలతో బతుకమ్మను నిర్వహిస్తారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మను ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుందని వారు అన్నారు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. అనంతరం బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థిని విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయులు ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొని రంగురంగుల తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, పాఠశాల ప్రాంగణంలో ఆటపాటలతో బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. అనంతరం బతుకమ్మలను ముత్యాలమ్మ దేవాలయ సమీపంలో గల పుష్కరిణిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాకతీయ స్కూల్ ఉపాధ్యాయులు కళ్యాణి, సంతోష, మాధవి, నందిని, గిరిజ, ప్రియాంక, నాగబాల, అశ్విని విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.