BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

బ్యాంకుల్ని దోచుకున్న వారికి సౌకర్యాలు – సామాన్యులకు కఠిన నిబంధనలు!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 06:40 PM
29 వీక్షణలు

బ్యాంకుల్ని దోచుకున్న వారికి సౌకర్యాలు – సామాన్యులకు కఠిన నిబంధనలు!

ఒడిశాలో జరిగిన రీతు ముండా ఘటన గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలను బహిర్గతం చేసిందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ తెలిపారు. వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా, వారి ఆస్తులు సీజ్ చేయకుండా ఉండగా సామాన్యులపై మాత్రం బ్యాంకులు నిబంధనల పేరుతో ఒత్తిడి తెస్తున్నాయని ఆయన విమర్శించారు.

ఒడిశా రాష్ట్రంలోని కియోంజర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటనలో జితు ముండా అనే గిరిజనుడు తన సోదరి మరణానంతరం ఆమె ఖాతాలో ఉన్న ₹19,300 తీసుకునేందుకు బ్యాంకును ఆశ్రయించాడు. కానీ డెత్ సర్టిఫికేట్ వంటి పత్రాలు లేకపోవడంతో అధికారులు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారు.

నిరక్షరాస్యుడైన జితు ముండా తీవ్ర నిరాశతో తన సోదరి సమాధి నుండి అస్థిపంజరాన్ని తవ్వి తీసుకుని బ్యాంకుకు తీసుకువచ్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం అస్థిపంజరాన్ని గౌరవప్రదంగా తిరిగి సమాధి చేయించారు.

ఈ ఘటనపై జిల్లా అధికారులు దర్యాప్తు ప్రారంభించి, బాధితుడికి అవసరమైన పత్రాలు అందించి బ్యాంక్ నుంచి డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు ఇప్పటికీ అందుబాటులో లేవని, అట్టడుగు వర్గాలకు నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయని ఈ ఘటన స్పష్టం చేస్తోందని హరినాథ్ పేర్కొన్నారు. ఖాతాదారులను ఇబ్బందులకు గురిచేసే కఠిన నిబంధనలను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు.