BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

బ్యాంకుల్ని దోచుకున్న వారికి సౌకర్యాలు – సామాన్యులకు కఠిన నిబంధనలు!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 06:40 PM
117 వీక్షణలు

బ్యాంకుల్ని దోచుకున్న వారికి సౌకర్యాలు – సామాన్యులకు కఠిన నిబంధనలు!

ఒడిశాలో జరిగిన రీతు ముండా ఘటన గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలను బహిర్గతం చేసిందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ తెలిపారు. వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా, వారి ఆస్తులు సీజ్ చేయకుండా ఉండగా సామాన్యులపై మాత్రం బ్యాంకులు నిబంధనల పేరుతో ఒత్తిడి తెస్తున్నాయని ఆయన విమర్శించారు.

ఒడిశా రాష్ట్రంలోని కియోంజర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటనలో జితు ముండా అనే గిరిజనుడు తన సోదరి మరణానంతరం ఆమె ఖాతాలో ఉన్న ₹19,300 తీసుకునేందుకు బ్యాంకును ఆశ్రయించాడు. కానీ డెత్ సర్టిఫికేట్ వంటి పత్రాలు లేకపోవడంతో అధికారులు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారు.

నిరక్షరాస్యుడైన జితు ముండా తీవ్ర నిరాశతో తన సోదరి సమాధి నుండి అస్థిపంజరాన్ని తవ్వి తీసుకుని బ్యాంకుకు తీసుకువచ్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం అస్థిపంజరాన్ని గౌరవప్రదంగా తిరిగి సమాధి చేయించారు.

ఈ ఘటనపై జిల్లా అధికారులు దర్యాప్తు ప్రారంభించి, బాధితుడికి అవసరమైన పత్రాలు అందించి బ్యాంక్ నుంచి డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు ఇప్పటికీ అందుబాటులో లేవని, అట్టడుగు వర్గాలకు నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయని ఈ ఘటన స్పష్టం చేస్తోందని హరినాథ్ పేర్కొన్నారు. ఖాతాదారులను ఇబ్బందులకు గురిచేసే కఠిన నిబంధనలను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు.