BREAKING
ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక
www.ntodaynews.com

చిట్యాల లో బెల్ట్ షాపులను మూసివేయాలి

తెలంగాణ
24 Jun, 2025 - 06:22 AM
243 వీక్షణలు
చిట్యాల లో బెల్ట్ షాపులను మూసివేయాలి -- తెలంగాణ మలి దశ ఉద్యమ నేత సంజయ్ దాస్ గౌడ్. NTODAY NEWS: జూన్ 23 రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో విచ్చలవిడిగా వెలిసిన మద్యం బెల్టు షాపులను వెంటనే మూసివేయాలని అందుకు తగిన చర్యలను తీసుకోవాలని ఎక్సైజ్, పోలీస్ శాఖలను తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, బీజేపీ నేత కూనూరు సంజయ్ దాస్ గౌడ్ డిమాండ్ చేశారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో గల్లి గల్లి లో రాత్రి పగలు లేకుండా మద్యం గొలుసు దుకాణాలు నిరంతరం నడుస్తున్నాయని దీనివలన పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాలు, ప్రార్ధన మందిరాలు,పాఠశాలల సమీపంలోనే మద్యం గొలుసు దుకాణాలు ఉండడం వల్ల మహిళలు విద్యార్థులు తాగుబోతుల వలన అసౌకర్యానికి గురవుతూ ఇబ్బందులు పడుతున్నారని దేవాలయకొచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చిట్యాల పట్టణంలో అర్ధరాత్రులు బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మడం వలన రాత్రుల్లో కాలనీలలో కొత్త కొత్త వ్యక్తులు సంచారిస్తున్నారని ప్రజల భద్రత విషయంలో ఆందోళన కలుగుతుందని సంజయ్ దాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులలో నాసిరకం మద్యం అమ్మడం వలన వ్యవసాయ ఇతర కూలీలు యువత ఆ మద్యం సేవించడం వలన చిన్న వయసులోనే చనిపోతున్నారని వారి ఆరోగ్యం పూర్తిగా క్షినిస్తుందని ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నo అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చిట్యాల లో మద్యం షాపులు రాత్రి పది గంటలకు మూసివేస్తే పట్టణంలోని మద్యం బెల్టు దుకాణాలు 24 గంటలు ఎవరి అనుమతి, అండదండలతో నిర్వహిస్తున్నరు అని సంజయ్ దాస్ గౌడ్ ప్రశ్నించారు. వైన్ షాపుల్లో దొరకని బ్రాండ్లు బీర్లు బెల్ట్ షాపుల్లో దొరుకుతున్నాయని, వైన్ షాపుల పక్కన సిట్టింగ్లు నిర్వహించాలి అంటే ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని నిబంధనలు ఉన్నాయని, పట్టణంలో ప్రజా నివాస ప్రాంతాల్లో కాలనీలలో, ఇండ్ల ల్లో మద్యం బెల్ట్ షాపుల్లో సిట్టింగ్లు నిర్వహిస్తూ, మధ్యo ప్రియులకు ఇష్టమైన వంటలు చేస్తూ వ్యాపారం చేయడానికి ఎవరు అనుమతి ఇస్తున్నారని, ప్రజల,యువత ఆరోగ్యాలతో ఆటలాడుతున్న మద్యం బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేరని ఆయన ప్రశ్నించారు. త్వరలో మద్యం గొలుసు (బెల్ట్) షాపులు మూసివేయాలని చిట్యాల పట్టణంలోని అన్ని పార్టీల నాయకులు, మహిళా సంఘాలు యువజన,విద్యార్థి సంఘాలు కలుపుకొని ప్రత్యేక్ష ఉద్యమ కార్యాచరణ చెప్పాడుతామని మద్యం బెల్టు దుకాణాలను పూర్తిగా బంద్ చేసే విధంగా రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, మహిళలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. Follow us on Website Facebook Instagram YouTube