www.ntodaynews.com
భారీగా పెరిగిన బంగారం ధరలు
తెలంగాణ
హైదరాబాద్, జులై 2: బంగారం ధరలు మరోసారి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు గురువారం ఒక్కసారిగా భారీగా పెరిగాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.3,770 పెరిగి రూ.1,44,550కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,450 పెరిగి రూ.1,32,500కు చేరింది.
అటు వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా కిలో రూ.2,44,900 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు తెలిపాయి.
బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఆభరణాల కొనుగోలుకు సిద్ధమైన వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.