www.ntodaynews.com
భారత ఇంటెలిజెన్స్ బ్యూరో కొత్త చీఫ్గా మహేష్ దీక్షిత్
జాతీయం
న్యూఢిల్లీ: భారత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) కొత్త డైరెక్టర్గా 1993 ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి మహేష్ దీక్షిత్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఐబీ చీఫ్గా ఉన్న తపన్ కుమార్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
మహేష్ దీక్షిత్ గతంలో కశ్మీర్లో ఐబీ జాయింట్ డైరెక్టర్గా పనిచేశారు. జమ్మూ–కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో భద్రతా, నిఘా వ్యవస్థల సమన్వయంలో కీలక బాధ్యతలు నిర్వహించిన అధికారిగా గుర్తింపు పొందారు. దేశ అంతర్గత భద్రత, నిఘా రంగాల్లో విస్తృత అనుభవం ఉన్న ఆయనను కేంద్ర ప్రభుత్వం ఐబీ చీఫ్గా నియమించింది.