BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

భార్య అక్రమ సంబంధాల షాక్..

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 09:50 PM
12 వీక్షణలు

భార్య అక్రమ సంబంధాల షాక్.. హుస్సేన్ సాగర్‌లో దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఉద్యోగి కుటుంబ విషాదం కలచివేస్తోంది. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతానికి చెందిన సీతారాం, నంద్యాల ప్రాంతానికి చెందిన రేణుక 2018లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఉద్యోగం నిమిత్తం కుటుంబం హైదరాబాద్‌లోని బాచుపల్లిలో స్థిరపడింది.

ఈ క్రమంలో భర్తకు తెలియకుండా రేణుక ముగ్గురితో వివాహేతర సంబంధాలు కొనసాగించినట్లు ఆరోపణలు వచ్చాయి. వారిలో రమణారెడ్డి అనే వ్యక్తితో కలిసి ఉన్న సమయంలో వ్యక్తిగత దృశ్యాలను చిత్రీకరించినట్లు తెలిసింది. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

భార్య వ్యవహారం తెలిసి తీవ్ర మనోవేదనకు గురైన సీతారాం, ఫిబ్రవరిలో 19 పేజీల ఆత్మహత్య లేఖ రాసి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ లేఖలో తన భార్య తనను మోసం చేసిందని, ఆమెకు ఏ లోటు లేకుండా చూసుకున్నానని, కానీ ఆమె నమ్మకద్రోహం తట్టుకోలేకపోయానని పేర్కొన్నాడు.

పోలీసులు ఆ లేఖ ఆధారంగా కేసు నమోదు చేసి రేణుకతో పాటు ఆమెకు సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు రమణారెడ్డి, శ్రవణ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబం చీలిపోయి ఇద్దరు చిన్నారులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లినట్లు బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.