BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

భార్య అక్రమ సంబంధాల షాక్..

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 09:50 PM
151 వీక్షణలు

భార్య అక్రమ సంబంధాల షాక్.. హుస్సేన్ సాగర్‌లో దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఉద్యోగి కుటుంబ విషాదం కలచివేస్తోంది. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతానికి చెందిన సీతారాం, నంద్యాల ప్రాంతానికి చెందిన రేణుక 2018లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఉద్యోగం నిమిత్తం కుటుంబం హైదరాబాద్‌లోని బాచుపల్లిలో స్థిరపడింది.

ఈ క్రమంలో భర్తకు తెలియకుండా రేణుక ముగ్గురితో వివాహేతర సంబంధాలు కొనసాగించినట్లు ఆరోపణలు వచ్చాయి. వారిలో రమణారెడ్డి అనే వ్యక్తితో కలిసి ఉన్న సమయంలో వ్యక్తిగత దృశ్యాలను చిత్రీకరించినట్లు తెలిసింది. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

భార్య వ్యవహారం తెలిసి తీవ్ర మనోవేదనకు గురైన సీతారాం, ఫిబ్రవరిలో 19 పేజీల ఆత్మహత్య లేఖ రాసి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ లేఖలో తన భార్య తనను మోసం చేసిందని, ఆమెకు ఏ లోటు లేకుండా చూసుకున్నానని, కానీ ఆమె నమ్మకద్రోహం తట్టుకోలేకపోయానని పేర్కొన్నాడు.

పోలీసులు ఆ లేఖ ఆధారంగా కేసు నమోదు చేసి రేణుకతో పాటు ఆమెకు సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు రమణారెడ్డి, శ్రవణ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబం చీలిపోయి ఇద్దరు చిన్నారులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లినట్లు బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.