www.ntodaynews.com
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణోత్సవానికి ఆహ్వానం
తెలంగాణ
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణోత్సవానికి ఆహ్వానం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి వార్షిక శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి హాజరు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని రాష్ట్ర మంత్రులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కళ్యాణోత్సవం ఏర్పాట్లు, భక్తుల కోసం చేపట్టిన సదుపాయాలపై ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు సమగ్రంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు తెలిపారు.
ప్రతి ఏడాది జరిగే ఈ వేడుకకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ఈసారి కూడా కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.