40 గ్రామాల సర్పంచుల చారిత్రాత్మక తీర్మానం
భద్రతకు భరోసా: 40 గ్రామాల సర్పంచుల చారిత్రాత్మక తీర్మానం. NTODAY NEWS నకిరేకల్
హెల్మెట్, సీటు బెల్టు లేనిదే ప్రయాణం వద్దు
రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా నకిరేకల్ నియోజకవర్గం సరికొత్త రికార్డుకు వేదికైంది. 'ARRIVE ALIVE' రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో నియోజకవర్గ పరిధిలోని 40 గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు రోడ్డు నిబంధనలపై కీలక తీర్మానం చేశారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల ప్రాణరక్షణే ప్రథమ ప్రాధాన్యతగా ప్రజాప్రతినిధులు ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రకటించారు. ఈ తీర్మానంలో ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని,
కారు ప్రయాణాల్లో డ్రైవర్తో పాటు ప్రయాణికులు కూడా సీటు బెల్టు ధరించాల్సిందే అని,
మద్యం సేవించి వాహనాలు నడపరాదు అని తీర్మానించారు ఈ చారిత్రాత్మక నిర్ణయంలో నియోజకవర్గంలోని సర్పంచులు కీలక పాత్ర పోషించారు. చిట్యాల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం, నార్కట్పల్లి సర్పంచ్ జేరిపోతుల భరత్, బొజ్జ సుందర్, కట్ట వెంకటరెడ్డి తదితర సర్పంచులందరూ కలిసి తీర్మాన పత్రాలను డీజీపీ శివధర్ రెడ్డికి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు అందజేశారు.