భగవాన్ శ్రీ సత్య సాయి సేవా సమితి గచ్చిబౌలి ఆధ్వర్యంలో-భగవాన్ శ్రీ సత్య సాయి బాబా స్వరార్చన కార్యక్రమం.......
భగవాన్ శ్రీ సత్య సాయి సేవా సమితి గచ్చిబౌలి ఆధ్వర్యంలో-భగవాన్ శ్రీ సత్య సాయి బాబా స్వరార్చన కార్యక్రమం........
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సత్య సాయి సేవా సంస్థ దేశవ్యాప్తంగా గృహ భజనలు నిర్వహిస్తున్నారు . ఈ సంవత్సరం జూన్ మాసం నుండి అక్టోబర్ మాసాంతం వరకు ప్రత్యేక స్వరార్చన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు శేరిలింగంపల్లి పరిధిలోగల వెంకటేశ్వర కాలనీలో ఉన్న చావలి సాయి లక్ష్మి రామకృష్ణ దంపతుల గృహంలో గృహ భజన కార్యక్రమము అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు నగర సంకీర్తన చేయడం జరిగింది.సాయంత్రం 6:50 నిమిషములకు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా గారి పాద పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం తదనంతరం సత్సంగం నిర్వహించారు ఈ సందర్బంగా భగవాన్ సత్య సాయి గొప్ప ఆధ్యాత్మిక గురువు మరియు మానవతావాది అనిఅన్నారు. ఈ సమాజములో విలువలు తగ్గుతున్న విలువలు పెంపొందించడానికి భావి భారత పౌరులైన చిన్నారులకు బాలవికాస్ తరగతులద్వారా సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింసలను భోదించిన దైవిక వ్యక్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని కొనియాడారు. అయన లక్ష్యం అందరిని ప్రేమించు, అందరికీ సేవచేయి. ఆయన మానవులకు పరిశుద్ధమైన త్రాగునీరు అందించడంతో పాటు విద్యా వైద్యం అందించ్చారని కొనియాడారు. అయన సందేశం సర్వే జనా లోకాసంస్థ సుఖీభవంతు అలానే, మానవ సేవే మాధవ సేవ అని స్వరార్చనలను(భజనలు)నిర్వహించారు.భారతదేశం లో సత్యం శివమ్ సుందరం అనే పేరుతో సెంటర్లను స్థాపించి, ప్రజలకు ఆధ్యాత్మికతను మరియు సేవా భావన కలిగించారు. ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాలలో 2000కు పైగా గల సత్య సాయి సేవా కేంద్రాలద్వారా కర్మ యోగులు అయినసత్య సాయి సేవా సభ్యులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.తర్వాత శ్రీ సత్య సాయి బాబా వారికి హారతి నిర్వహణ ఆ తర్వాత తీర్థప్రసాదాలు వినియోగం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు డాక్టర్ బి కే రామన్న, డీవీకే రావు, వినయ్ కుమార్, వెంకట్ రెడ్డి, విష్ణు, ప్రదీప్, భీమ్ గుప్తా, డా ll అరుణశ్రీ, శ్రీ మతి పద్మలత తదితరులు పాల్గొన్నారు.