BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

భోజనానికి పిలిచి హత్య.. పూజా గదిలో నరబలి తల దాచిన నిందితుడు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:07 AM
68 వీక్షణలు

భోజనానికి పిలిచి హత్య.. పూజా గదిలో నరబలి తల దాచిన నిందితుడు

బొలాంగీర్: భార్యను తిరిగి తెచ్చుకోవాలనే మూఢనమ్మకంతో ఘాతుకం.. ఐదుగురు అరెస్ట్

ఒడిశా: భోజనానికి ఆహ్వానించి నమ్మకంగా ఇంటికి పిలిచిన వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన ఒడిశాలోని బొలాంగీర్ జిల్లాలో కలకలం రేపింది. ఆగస్టు 18న జరిగిన ఈ ఘటనలో సంతోష్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు శత్రుఘ్న సాహూ తన సహచరులతో కలిసి సంతోష్‌ను భోజనానికి పిలిచాడు. అనంతరం అతడు నిద్రలోకి జారుకున్న సమయంలో కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మృతదేహం నుంచి తలను వేరు చేసి, గ్రామం వెలుపల ఉన్న చెరువులో మొండెాన్ని పడేసినట్లు వెల్లడించారు.

తెగిపోయిన తలను మాత్రం సాహూ తన ఇంట్లోని పూజా గదిలో దాచినట్లు దర్యాప్తులో బయటపడింది. భార్యను తిరిగి తన వద్దకు తీసుకురావాలనే మూఢనమ్మకంతో నరబలి ఇచ్చేందుకు ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శత్రుఘ్న సాహూతో పాటు మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.