www.ntodaynews.com
నిత్యకళారాధనలో భాగంగా భరతనాట్యం ప్రదర్శన
తెలంగాణ
నిత్యకళారాధనలో భాగంగా భరతనాట్యం ప్రదర్శన
NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున
శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం – నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం భరతనాట్యం ప్రదర్శన ఏర్పాటు చేశారు. హైదరాబాద్కు చెందిన తాండవ డాన్స్ అకాడమీ కళాకారులు ఈ ప్రదర్శనను అందించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో గణపతి స్తుతి, శివతాండవం, శివశివ శంకరా, నటరాజ నమో తదితర గీతాలకు మనస్వి, అక్షర, భావన, దీక్షిత నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.
ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణ లక్ష్యంగా నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం వెల్లడించింది. ఈ కార్యక్రమాలలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని వంటి సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
— కార్యనిర్వహణాధికారివారి ఉత్తర్వుల మేరకు జారీ
#Srisailam #NityaKalaradhana #Bharatanatyam #CulturalProgramme #TempleEvents #DevotionalArts
Follow us on
Website
Facebook
Instagram
YouTube