BREAKING
అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ
Date of Publish : 07 February 2026, 08:47 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జగిత్యాలలో బీఆర్‌ఎస్ కార్నర్ మీటింగ్

తెలంగాణ
07 Feb, 2026 - 08:47 AM
384 వీక్షణలు
జగిత్యాలలో బీఆర్‌ఎస్ కార్నర్ మీటింగ్ మైనార్టీల సంక్షేమమే లక్ష్యం: దావ వసంత సురేష్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి: లక్ష్మణ్ జగిత్యాల పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున విస్తృతంగా కార్నర్ మీటింగులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 17, 34, 35, 47, 48 వార్డులలో బీఆర్‌ఎస్ అభ్యర్థులైన ఎండీ జవీద్ ఫహద్, ఆశ్ర రిజ్వాన్, ఎండీ అబ్దుల్ ఆరిఫ్, అసిం సవన్‌కు మద్దతుగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా తొలి జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్తో పాటు మాజీ మంత్రి రాజేశం గౌడ్ పాల్గొన్నారు. Jagityal ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు. మైనార్టీలకు వంద శాతం సబ్సిడీలు, షాదీ ముబారక్, రంజాన్ తోప, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం వంటి అనేక సంక్షేమ పథకాలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ఘనత ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల కాలంలో మైనార్టీల కోసం ఒక్క కొత్త సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదని ఆమె విమర్శించారు. గతంలో మసీదుల అభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేసిన చరిత్ర బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ముస్లిం సోదరులు, సోదరీమణులు సమగ్రంగా ఆలోచించి కారు గుర్తుపై ఓటు వేసి జగిత్యాల పట్టణంలో గులాబీ జెండాను ఎగరవేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #Jagityal #BRSCornerMeeting #BRSParty #MinorityWelfare #MunicipalElections2026 #TelanganaPolitics #VoteForCar #KCRLeadership Follow us on Website Facebook Instagram YouTube