www.ntodaynews.com
జగిత్యాలలో బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్
తెలంగాణ
జగిత్యాలలో బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్
మైనార్టీల సంక్షేమమే లక్ష్యం: దావ వసంత సురేష్
NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి: లక్ష్మణ్
జగిత్యాల పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున విస్తృతంగా కార్నర్ మీటింగులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 17, 34, 35, 47, 48 వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులైన ఎండీ జవీద్ ఫహద్, ఆశ్ర రిజ్వాన్, ఎండీ అబ్దుల్ ఆరిఫ్, అసిం సవన్కు మద్దతుగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా తొలి జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్తో పాటు మాజీ మంత్రి రాజేశం గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు. మైనార్టీలకు వంద శాతం సబ్సిడీలు, షాదీ ముబారక్, రంజాన్ తోప, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం వంటి అనేక సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ఘనత ఉందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల కాలంలో మైనార్టీల కోసం ఒక్క కొత్త సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదని ఆమె విమర్శించారు. గతంలో మసీదుల అభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
ముస్లిం సోదరులు, సోదరీమణులు సమగ్రంగా ఆలోచించి కారు గుర్తుపై ఓటు వేసి జగిత్యాల పట్టణంలో గులాబీ జెండాను ఎగరవేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#Jagityal
#BRSCornerMeeting
#BRSParty
#MinorityWelfare
#MunicipalElections2026
#TelanganaPolitics
#VoteForCar
#KCRLeadership
Follow us on
Website
Facebook
Instagram
YouTube