BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

చాట్రాయి అనుదీప్ మరణం పై ప్రత్యేక విచారణలో వేగం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 10:50 AM
269 వీక్షణలు

 చాట్రాయి అనుదీప్ మరణం పై ప్రత్యేక విచారణలో వేగం… రంగంలోకి దిగిన అధికారి రాజశేఖర్

చాట్రాయి, ఏప్రిల్ 4:

చాట్రాయి మండల కేంద్రంలో వివాదాస్పదంగా మారిన అంబటి అనుదీప్ మృతి కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసు నిగ్గు తేల్చేందుకు నియమితులైన ప్రత్యేక విచారణ అధికారి రాజశేఖర్ శుక్రవారం రంగంలోకి దిగారు.

ముందుగా చాట్రాయికి చేరుకున్న ఆయన, అనుదీప్ మృతి చెందిన ప్రదేశాన్ని పరిశీలించి కీలక వివరాలను సేకరించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను కలుసుకుని, సంఘటన జరిగిన రోజు పరిస్థితులపై విచారణ జరిపారు.

అనుదీప్ మృతి ఆత్మహత్యా? లేక హత్యా? అనే అంశాన్ని సమగ్రంగా విచారించి త్వరలోనే నిజాలు వెలుగులోకి తీసుకువస్తామని రాజశేఖర్ తెలిపారు. ఈ దర్యాప్తుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు.

ఈ కేసులో భాగంగా అనుదీప్ స్నేహితులతో పాటు ప్రియురాలు మరియు ఆమె కుటుంబ సభ్యులను కూడా విచారించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలాగే చాట్రాయి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన విచారణ అధికారి, కేసుకు సంబంధించిన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇక ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారిని ఏలూరుకు పిలిపించగా, జనసేన నాయకులు తుమ్మల జగన్, పాశం నాగబాబు, తుమ్మల శంకర్ హాజరై తమ వాంగ్మూలాలు ఇచ్చారు. కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని వారు కోరగా, జిల్లా ఎస్పీ నుండి ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయని విచారణ అధికారి తెలిపినట్లు తుమ్మల జగన్ పేర్కొన్నారు.