BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

చాట్రాయి ఘటనపై ఉద్రిక్తత.. అనుదీప్ మృతి కేసులో సమగ్ర విచారణకు డిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 10:43 PM
194 వీక్షణలు

చాట్రాయి ఘటనపై ఉద్రిక్తత.. అనుదీప్ మృతి కేసులో సమగ్ర విచారణకు డిమాండ్

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం చాట్రాయి గ్రామంలో జరిగిన అంబటి అనుదీప్ అనుమానాస్పద మృతి కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 17 ఏళ్ల యువకుడి మృతి పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయం కోసం ముందుకు వచ్చారు.

ఈ నేపథ్యంలో అనుదీప్ కుటుంబ సభ్యులు, తండ్రి అంబటి గోపాలరావు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్‌ను కలిసి తమ వేదనను వివరించారు. జనసేన నాయకుడు, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

అనుదీప్ మృతి వెనుక ప్రేమ వ్యవహారం కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రెడ్డి అప్పలనాయుడు, “నూజివీడులో ఇలాంటి ఘటన జరగడం బాధాకరం. మృతుడు మా పార్టీ కార్యకర్త కావడంతో ఈ ఘటనపై మరింత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యుల ఆవేదనను ప్రభుత్వం, పోలీసులు గమనించాలి” అని అన్నారు. మంత్రి కొలుసు పార్థసారథి కూడా ఈ ఘటనపై ప్రత్యేక విచారణకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

అనుదీప్ మృతి కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలని, స్థానిక పోలీసులతో పాటు ఇతర ప్రాంతాల అధికారులతో ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని, సీసీ కెమెరా ఫుటేజ్ సహా అన్ని ఆధారాలను పరిశీలించి నిజాన్ని బయటపెట్టాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ బాధిత కుటుంబానికి హామీ ఇస్తూ, ప్రత్యేక అధికారితో విచారణ చేపట్టి నిజాన్ని నిగ్గుతేలుస్తామని తెలిపారు. ఈ కేసులో ఎవరు ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో చాట్రాయి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు, కొండలరావు తదితర పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.