BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 29 March 2026, 11:11 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండలం పర్వతాపురంలో టిడిపి ఘనంగా 44వ ఆవిర్భావ దినోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 11:11 AM
261 వీక్షణలు

చాట్రాయి మండలం పర్వతాపురంలో టిడిపి ఘనంగా 44వ ఆవిర్భావ దినోత్సవం 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మిద్దె సత్యనారాయణ, అడివి సత్యం ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా జరిగింది.

ఈ వేడుకలో మండల టిడిపి వాణిజ్య విభాగ కార్యదర్శి మిద్దె మురళీ మహేశ్వరావు, బీసీ సెల్ ఆర్గనైజర్ సెక్రటరీ బయగాని కళ్యాణ్ రావు, తెలుగు రైతు కార్యదర్శి చీపు మల్లేశ్వరరావు, ఎస్సీ సెల్ సెక్రటరీ కల్లేపల్లి ప్రభాకర్ రావు పాల్గొన్నారు.

అలాగే గ్రామ పార్టీ బూత్ కన్వీనర్ బొర్రా రామకృష్ణ, కల్లేపల్లి మహేష్, కె. వసంతరావు, గ్రామ పార్టీ కార్యదర్శి సిహెచ్ నాగేశ్వరావు, బిచెన్నారావు, చొప్పరపు లక్ష్మయ్య, చొప్పరపు నరసింహారావు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా స్థాపించబడిన పార్టీ అని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయిలో బలోపేతం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని స్పష్టం చేశారు.

“ప్రతి ఇంటికీ అభివృద్ధి చేరే వరకు మా కృషి ఆగదు”, “రైతుల సంక్షేమం, యువత అభివృద్ధి కోసం టిడిపి కట్టుబడి ఉంటుంది”, “ప్రజల నమ్మకమే మా బలం” అని నాయకులు తెలిపారు.

గ్రామ ప్రజలు ఉత్సాహభరితంగా పాల్గొనడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.