చాట్రాయి మండలంలో ఘనంగా మేడే వేడుకలు
చాట్రాయి మండలంలో ఘనంగా మేడే వేడుకలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల కేంద్రంతో పాటు చిన్నంపేట గ్రామంలో ఏఐటీయూసీ, వ్యవసాయ కార్మిక సంఘం, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని కౌలు రైతు సంఘం నూజివీడు నియోజకవర్గ కార్యదర్శి ఎన్. నరసింహ, వ్యవసాయ కార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల నాయకుడు నెల్లూరు మురళి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ, మే డే అనేది కార్మిక వర్గం తమ హక్కుల కోసం ఎన్నో ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న చారిత్రాత్మక రోజు అని పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత, పని గంటల తగ్గింపు, కార్మిక హక్కుల సాధనకు మేడే ప్రతీక అని గుర్తు చేశారు. ప్రతి కార్మికుడు ఐక్యంగా ఉండి తమ సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డులో ఉన్న పథకాలను పూర్తిగా అమలు చేయించుకునేందుకు అందరూ ఐక్యంగా ముందుకు రావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గంధం రాజేష్, టి. వెంకన్నతో పాటు సుమారు 70 మంది భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.