BREAKING
ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు
www.ntodaynews.com

చాట్రాయి మండలంలో ఘనంగా మేడే వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 11:37 AM
103 వీక్షణలు

చాట్రాయి మండలంలో ఘనంగా మేడే వేడుకలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల కేంద్రంతో పాటు చిన్నంపేట గ్రామంలో ఏఐటీయూసీ, వ్యవసాయ కార్మిక సంఘం, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని కౌలు రైతు సంఘం నూజివీడు నియోజకవర్గ కార్యదర్శి ఎన్. నరసింహ, వ్యవసాయ కార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల నాయకుడు నెల్లూరు మురళి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ, మే డే అనేది కార్మిక వర్గం తమ హక్కుల కోసం ఎన్నో ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న చారిత్రాత్మక రోజు అని పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత, పని గంటల తగ్గింపు, కార్మిక హక్కుల సాధనకు మేడే ప్రతీక అని గుర్తు చేశారు. ప్రతి కార్మికుడు ఐక్యంగా ఉండి తమ సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డులో ఉన్న పథకాలను పూర్తిగా అమలు చేయించుకునేందుకు అందరూ ఐక్యంగా ముందుకు రావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గంధం రాజేష్, టి. వెంకన్నతో పాటు సుమారు 70 మంది భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.