చాట్రాయి మండలంలో SIR అవగాహన సదస్సు ఏర్పాటు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వర రావు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం తుమ్మగూడెం మధ్య విజయవాడ రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆదేశాల ప్రకారం Special Intensive Revision (SIR) కార్యక్రమంపై మండలాల వారీ అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో చాట్రాయి మండలంలో ఈ సమావేశం 08-06-2026 ఉదయం 10.00 గంటలకు జనార్ధనవరం తుమ్మగూడెం మధ్యలోని మామిడి తోటలో ఏర్పాటు చేయబడింది.
ఈ సదస్సుకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి మరియు పార్టీ పరిశీలకులు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి హాజరవుతున్నట్లు సమాచారం. సమావేశంలో బూత్ ఇంచార్జీలు, యూనిట్ ఇంచార్జీలు, క్లస్టర్ ఇంచార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, బీఎల్ఏలు మరియు పార్టీ కీలక నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నారు.
టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు ఈ సమావేశం ద్వారా పార్టీ కార్యకర్తలకు SIR పై పూర్తి అవగాహన ఏర్పడేలా చూస్తామని తెలిపారు.