BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

చాట్రాయి పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్సై డి రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jun, 2026 - 06:30 PM
244 వీక్షణలు

చాట్రాయి: 07.06.2026 – ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు ఈ రోజు ఉదయం ఎస్.ఐ డి. రామకృష్ణ ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు తమ పాత అలవాట్లను మానుకుని క్రమపద్ధతిగా సత్ప్రవర్తన పాటించాలని స్పష్టం చేశారు. ఎలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకూడదని, సమాజంలో శాంతి సామరస్యానికి ఏ విధమైన విఘాతం కలిగించరాదు అని హెచ్చరించారు. చట్టవ్యతిరేక పనుల నుండి దూరంగా ఉండి బాధ్యతా యుతమైన పౌరులుగా మెలగాలని సూచించారు.

సత్ప్రవర్తనను పాటిస్తూ, నేరపూరిత చర్యలకు పాల్పడని రౌడీ షీట్లను తొలగించే ప్రక్రియను పరిశీలించి, వారి పేర్లను పై అధికారులకు సిఫార్సు చేస్తామని ఎస్.ఐ గారు హామీ ఇచ్చారు. కౌన్సిలింగ్ సమయంలో రౌడీ షీటర్లకు వ్యక్తిగతంగా మరియు సమూహంగా గమనికలు ఇచ్చి, తప్పులు పునరావృతమైతే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.