చాట్రాయి పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్సై డి రామకృష్ణ
చాట్రాయి: 07.06.2026 – ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు ఈ రోజు ఉదయం ఎస్.ఐ డి. రామకృష్ణ ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు తమ పాత అలవాట్లను మానుకుని క్రమపద్ధతిగా సత్ప్రవర్తన పాటించాలని స్పష్టం చేశారు. ఎలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకూడదని, సమాజంలో శాంతి సామరస్యానికి ఏ విధమైన విఘాతం కలిగించరాదు అని హెచ్చరించారు. చట్టవ్యతిరేక పనుల నుండి దూరంగా ఉండి బాధ్యతా యుతమైన పౌరులుగా మెలగాలని సూచించారు.
సత్ప్రవర్తనను పాటిస్తూ, నేరపూరిత చర్యలకు పాల్పడని రౌడీ షీట్లను తొలగించే ప్రక్రియను పరిశీలించి, వారి పేర్లను పై అధికారులకు సిఫార్సు చేస్తామని ఎస్.ఐ గారు హామీ ఇచ్చారు. కౌన్సిలింగ్ సమయంలో రౌడీ షీటర్లకు వ్యక్తిగతంగా మరియు సమూహంగా గమనికలు ఇచ్చి, తప్పులు పునరావృతమైతే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.