www.ntodaynews.com
చాట్రాయి తహసీల్దార్కు మర్యాదపూర్వక సత్కారం అందజేసిన మోరంపూడి శ్రీనివాసరావు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల తహసీల్దార్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్వేతను చాట్రాయి తహసీల్దార్ కార్యాలయంలో తెలుగు రైతు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దుశ్శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి నివాస రావు, చనుబండ బూత్ కన్వీనర్ పరసా శ్రీను, నూజివీడు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము పాల్గొన్నారు.
గ్రామీణ అభివృద్ధి, రైతు సమస్యల పరిష్కారం, మండల స్థాయి పరిపాలనలో సమన్వయంతో ముందుకు సాగాలని నాయకులు ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు.
సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, రైతులకు అవసరమైన సేవలను వేగవంతం చేస్తూ పారదర్శక పరిపాలన అందిస్తామని తెలిపారు.