www.ntodaynews.com
చాట్రాయిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చాట్రాయిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్ధానిక చాట్రాయిలో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ టీడీపీ అధ్యక్షులు గడ్డం ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మందపాటి బసవా రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆవిర్భవించిన తెలుగు దేశం పార్టీ ప్రజల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేసి చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.