BREAKING
పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని బెంగళూరులో అన్నదానం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణనికి భూమి పూజ.. చాట్రాయిలో పోలీసు అవగాహన సదస్సు మహిళల రక్షణ చీపురుగూడెంలో సర్కార్ బడిలో పిల్లలను చేర్పించండి మహిళా రిజర్వేషన్ బిల్లుపై వామపక్షాల తీవ్ర విమర్శలు నంద్యాలను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమిష్టి కృషి పద్మశాలీల జనాభా కుల గణనలో 6 లక్షల మందిని ఎందుకు తగ్గించారు? తొర్రూరులో ఉచిత కంప్యూటర్ శిక్షణ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆరోగ్య మెరుగుకై చాట్రాయి మండల జనసైనికుల ప్రత్యేక పూజ పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని బెంగళూరులో అన్నదానం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణనికి భూమి పూజ.. చాట్రాయిలో పోలీసు అవగాహన సదస్సు మహిళల రక్షణ చీపురుగూడెంలో సర్కార్ బడిలో పిల్లలను చేర్పించండి మహిళా రిజర్వేషన్ బిల్లుపై వామపక్షాల తీవ్ర విమర్శలు నంద్యాలను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమిష్టి కృషి పద్మశాలీల జనాభా కుల గణనలో 6 లక్షల మందిని ఎందుకు తగ్గించారు? తొర్రూరులో ఉచిత కంప్యూటర్ శిక్షణ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆరోగ్య మెరుగుకై చాట్రాయి మండల జనసైనికుల ప్రత్యేక పూజ
www.ntodaynews.com

చాట్రాయిలో పోలీసు అవగాహన సదస్సు మహిళల రక్షణ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Apr, 2026 - 05:33 AM
30 వీక్షణలు

నేర నియంత్రణ పై అవగాహన

సమాజంలో మహిళల రక్షణ, నేర నియంత్రణ మరియు ప్రజల భద్రతే ధ్యేయంగా ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోంది. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాలపై నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ పర్యవేక్షణలో చాట్రాయి వెలుగు కార్యాలయ ప్రాంగణంలో నూజివీడు రూరల్ సీఐ కె. రామకృష్ణ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్య‌క్రమంలో చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ, సిబ్బంది ప్రజలకు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. మహిళా సంరక్షణ శక్తి టీమ్స్ మహిళలు మరియు విద్యార్థినుల భద్రత కోసం ఏర్పాటు చేసిన శక్తి టీమ్స్ ప్రాధాన్యతను వివరించారు. మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, వేధింపులకు గురైతే భయం వీడి పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.

ఆన్‌లైన్ మోసాలు, ఓటిపి, బ్యాంక్ వివరాలు ఇతరులకు చెప్పడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 కి ఫోన్ చేయాలని సూచించారు. వేసవి కాలంలో ప్రజలు ఊర్లకు వెళ్లే సమయంలో ఇళ్లకు పటిష్టమైన తాళాలు వేయాలని, విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112 కు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామాల్లో మరియు వ్యాపార సంస్థల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను అరికట్టవచ్చని, ఇది మూడవ కన్నులా పనిచేస్తుందని వివరించారు.

ద్విచక్ర వాహన దారులు ప్రయాణించే సమయంలో తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేని పక్షంలో చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడమే కాకుండా భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

ప్రజల సహకారం తోనే నేరరహిత సమాజాన్ని నిర్మించగలమని, ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, పోలీస్ సిబ్బంది, మహిళలు మరియు స్థానిక యువత పాల్గొన్నారు.