BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

చాట్రాయిలో పోలీసు అవగాహన సదస్సు మహిళల రక్షణ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Apr, 2026 - 05:33 AM
97 వీక్షణలు

నేర నియంత్రణ పై అవగాహన

సమాజంలో మహిళల రక్షణ, నేర నియంత్రణ మరియు ప్రజల భద్రతే ధ్యేయంగా ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోంది. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాలపై నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ పర్యవేక్షణలో చాట్రాయి వెలుగు కార్యాలయ ప్రాంగణంలో నూజివీడు రూరల్ సీఐ కె. రామకృష్ణ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్య‌క్రమంలో చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ, సిబ్బంది ప్రజలకు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. మహిళా సంరక్షణ శక్తి టీమ్స్ మహిళలు మరియు విద్యార్థినుల భద్రత కోసం ఏర్పాటు చేసిన శక్తి టీమ్స్ ప్రాధాన్యతను వివరించారు. మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, వేధింపులకు గురైతే భయం వీడి పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.

ఆన్‌లైన్ మోసాలు, ఓటిపి, బ్యాంక్ వివరాలు ఇతరులకు చెప్పడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 కి ఫోన్ చేయాలని సూచించారు. వేసవి కాలంలో ప్రజలు ఊర్లకు వెళ్లే సమయంలో ఇళ్లకు పటిష్టమైన తాళాలు వేయాలని, విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112 కు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామాల్లో మరియు వ్యాపార సంస్థల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను అరికట్టవచ్చని, ఇది మూడవ కన్నులా పనిచేస్తుందని వివరించారు.

ద్విచక్ర వాహన దారులు ప్రయాణించే సమయంలో తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేని పక్షంలో చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడమే కాకుండా భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

ప్రజల సహకారం తోనే నేరరహిత సమాజాన్ని నిర్మించగలమని, ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, పోలీస్ సిబ్బంది, మహిళలు మరియు స్థానిక యువత పాల్గొన్నారు.