చాట్రాయిలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
50 మంది పేదలకు కూరగాయల పంపిణీ
ఏలూరు జిల్లా చాట్రాయి మండల కేంద్రంలో జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు సవరం రామారావు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 50 మంది పేద కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తుమ్మల కరుణ, రంగారావు, మహేష్, దుర్గారావు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు అండగా నిలిచేలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని నాయకులు తెలిపారు.