కార్మికుల సంక్షేమం, భద్రతే మా బాధ్యత : చైర్పర్సన్ గీత రమేష్
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బుధవారం ఉదయం పురపాలక సంఘ కార్యాలయంలో చైర్పర్సన్ పందిరి గీత రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.బిఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. కార్మికులకు నెలనెలా జీతాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గురులింగం, వైస్ చైర్పర్సన్ శ్రీలక్ష్మి సైదులు, కౌన్సిలర్లు సత్యనారాయణ, పరమేశ్, షబానా అజీమ్, సందీప్ రాంరెడ్డి, మేనేజర్ ఫాతిమ, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేష్, శానిటరీ జవాన్లు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.