గోపాలపురంలో రేషన్ షాపుల తనిఖీ
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలంలో తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా గోపాలపురం గ్రామంలోని రేషన్ షాప్ నంబర్ 11, కంభంపాడు గ్రామంలోని రేషన్ షాప్ నంబర్ 30లను తనిఖీ చేశారు.
రేషన్ షాపుల్లో ప్రజలకు అందిస్తున్న నిత్యావసర సరుకులు, సరుకుల నిల్వలు, పంపిణీ విధానం, నిల్వల రిజిస్టర్లు తదితర అంశాలను పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకులను పారదర్శకంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. రేషన్ సరుకుల పంపిణీలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
ఈ తనిఖీల్లో సీఎస్డీటీ శ్వేత పాల్గొన్నారు.