BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

చాట్రాయిమండలంలో ఏవో బి శివశంకర్ ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Aug, 2026 - 05:02 PM
20 వీక్షణలు

చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని అన్ని గ్రామాల రైతు సేవా కేంద్రాల్లో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతు సేవా కేంద్రాల వ్యవసాయ సహాయక అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు, నీటి వినియోగదారుల సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు రైతులకు ఎల్నినో ప్రభావంపై అవగాహన కల్పించారు.

ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. పంటల యాజమాన్య పద్ధతులు, నీటి వనరులను పొదుపుగా వినియోగించుకునే విధానం, బిందు సేద్యం ప్రయోజనాలు, ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.

ఖాళీగా ఉన్న భూములను ఏడాది పొడవునా పంటలు లేదా పచ్చిరొట్ట పంటలతో కప్పి ఉంచే విధానాన్ని రైతులు అవలంబించాలని సూచించారు. నవధాన్యాలు, ఆయిల్‌పామ్‌–మామిడి తోటల్లో నవధాన్యాలు, పప్పుధాన్యాల సాగు చేపట్టడం ద్వారా భూమి సారాన్ని కాపాడుకోవడంతో పాటు నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు.

అనంతరం ఆరుగొలనుపేట గ్రామంలో రైతులతో అధికారులు చర్చించి, ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై సూచనలు అందించారు.