చీపురుగూడెం పాఠశాలకు కంప్యూటర్ అందజేత
చీపురుగూడెం పాఠశాలకు కంప్యూటర్ అందజేత – ఉపాధ్యాయుడు నంద్యాల శ్రీనివాసరెడ్డికి ఘన సన్మానం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చీపురుగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో అభివృద్ధికి మరో అడుగు పడింది. సుమారు రూ.65 వేల విలువైన పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ను రోటరీ క్లబ్ ద్వారా అందజేయించడంలో కీలక పాత్ర పోషించిన సి. గుడిపాడు పాఠశాల ఉపాధ్యాయుడు నంద్యాల శ్రీనివాసరెడ్డిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చాట్రాయి మండల విద్యాశాఖ అధికారి-1 మాసగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలు పెంపొందించడం విద్యార్థుల అభ్యాసానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.
పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ డి. సుందరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు బొట్టు లక్ష్మణరావు మాట్లాడుతూ, విద్యా రంగానికి ఉపాధ్యాయులు చేస్తున్న సేవలు అమూల్యమని కొనియాడారు. గ్రామీణ పాఠశాలల్లో సదుపాయాలు పెరగడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సత్తెనపల్లి రాము, బి.సిహెచ్. రాంబాబు, ఏ. చెన్నారావు, గంటా షాకీనా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.