BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

చీపురుగూడెం పాఠశాలకు కంప్యూటర్ అందజేత

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Mar, 2026 - 01:03 PM
159 వీక్షణలు

చీపురుగూడెం పాఠశాలకు కంప్యూటర్ అందజేత – ఉపాధ్యాయుడు నంద్యాల శ్రీనివాసరెడ్డికి ఘన సన్మానం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చీపురుగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో అభివృద్ధికి మరో అడుగు పడింది. సుమారు రూ.65 వేల విలువైన పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్‌ను రోటరీ క్లబ్ ద్వారా అందజేయించడంలో కీలక పాత్ర పోషించిన సి. గుడిపాడు పాఠశాల ఉపాధ్యాయుడు నంద్యాల శ్రీనివాసరెడ్డిని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చాట్రాయి మండల విద్యాశాఖ అధికారి-1 మాసగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలు పెంపొందించడం విద్యార్థుల అభ్యాసానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.

పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ డి. సుందరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు బొట్టు లక్ష్మణరావు మాట్లాడుతూ, విద్యా రంగానికి ఉపాధ్యాయులు చేస్తున్న సేవలు అమూల్యమని కొనియాడారు. గ్రామీణ పాఠశాలల్లో సదుపాయాలు పెరగడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సత్తెనపల్లి రాము, బి.సిహెచ్. రాంబాబు, ఏ. చెన్నారావు, గంటా షాకీనా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.