www.ntodaynews.com
చీపురుగూడెంలో సర్కార్ బడిలో పిల్లలను చేర్పించండి
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం ఎంపియూపి, చీపురుగూడెం పాఠశాలలో "బడిపిలుస్తోంది" కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో భాగంగా, సర్కార్ బడిలో విద్యార్థులను చేర్పించే సూచనతో "సర్కార్ విద్య - సంపూర్ణ విద్య" నినాదాలతో ర్యాలీ చేపట్టారు.
గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు బొట్టు. లక్ష్మణరావు, బొట్టు. రామచంద్రరావు, మందలపు. జగదీశ్, పాఠశాల ఉపాధ్యాయులు సత్తెనపల్లి. రాము, బి. సిహెచ్. రాంబాబు, రామారావు, లీలా, అంగన్వాడీ టీచర్ బేబీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని, సర్కార్ బడిలో విద్యార్థులను చేర్చే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించారు.