www.ntodaynews.com
చింతకాయల పేరుతో మోసం… మహిళ తాళిబొట్టు లాక్కొని పరార్
ఆంధ్రప్రదేశ్
/
చిత్తూరు
చింతకాయల పేరుతో మోసం… మహిళ తాళిబొట్టు లాక్కొని పరార్
చిత్తూరు జిల్లా వాల్మీకిపురం (వి. కోట) సమీపంలోని మంచూరు గ్రామంలో దొంగతనం ఘటన కలకలం రేపింది. చంద్రమ్మ అనే మహిళ పొలంలో పని చేస్తుండగా, చింతకాయలు కొనుగోలు చేస్తామని చెప్పి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఆమెను మోసం చేశాడు. మాట్లాడుతున్నట్టే నటిస్తూ ఆమె దృష్టి మరల్చి, మెడలో ఉన్న తాళిబొట్టును లాక్కొన్నాడు. అనంతరం ముందే సిద్ధంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి బైక్పై వేగంగా పరారయ్యాడు.
ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి ఫోటోను విడుదల చేశారు. అనుమానాస్పద వ్యక్తులపై సమాచారం ఉన్నవారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.