BREAKING
బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి....
Date of Publish : 12 September 2026, 11:00 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి: గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై ఘోర బస్సు ప్రమాదం.. ఒకరు మృతి, 17 మందికి పైగా గాయాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Sep, 2026 - 11:00 AM
32 వీక్షణలు

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం యండపల్లి సమీపంలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి విజయనగరం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్‌ బస్సు అదుపుతప్పి రహదారిపై నిలిపి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మరో 17 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో పలువురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ నుంచి విజయనగరం వెళ్తుండగా యండపల్లి సమీపంలో ఈ ఘటన జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతినడంతో క్లీనర్‌ అందులో చిక్కుకుని మృతి చెందినట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానికుల సహాయంతో బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న చింతలపూడి పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చింతలపూడి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ క్రాంతికుమార్‌, ఎస్‌ఐ సతీష్‌ ఘటనాస్థలిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నారు.