చింతలపూడి పట్టణ సుందరీకరణలో మరో ముందడుగు..
చింతలపూడి పట్టణ సుందరీకరణలో మరో ముందడుగు.. మినీ బస్టాండ్ సెంటర్లో వాటర్ ఫౌంటెన్–2 నిర్మాణానికి శ్రీకారం
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణ సుందరీకరణలో మరో కీలక అడుగు పడింది. పట్టణంలోని మినీ బస్టాండ్ సెంటర్లో ఆధునిక హంగులతో నిర్మించనున్న వాటర్ ఫౌంటెన్–2 నిర్మాణ పనులకు చింతలపూడి శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్ భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.
పట్టణాన్ని మరింత అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఫౌంటెన్ నిర్మాణం పూర్తయిన తర్వాత మినీ బస్టాండ్ సెంటర్కు కొత్త శోభ చేకూరడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, మౌలిక వసతుల కల్పనతో పాటు సుందరీకరణ పనులను కూడా వేగవంతంగా అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
అభివృద్ధి పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. పట్టణ సౌందర్యాన్ని పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని పనుల ప్రారంభానికి హర్షం వ్యక్తం చేశారు.