BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

చింతలపూడిలో గుంతల రహదారి… వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 02:43 PM
71 వీక్షణలు

చింతలపూడి మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

చింతలపూడి పట్టణంలోని రత్నహాల్ థియేటర్ ముందు నుంచి మేడబడి వరకు ఉన్న ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రజలకు తీవ్ర సమస్యలు కలిగిస్తున్నాయి.

వర్షం సమయంలో ఈ గుంతల్లో నీరు నిల్వ కావడంతో వాటి లోతు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, విద్యార్థులు, వృద్ధులు ఈ మార్గంలో ప్రయాణించేందుకు భయపడుతున్నారు. అనేక చోట్ల వాహనాలు అదుపుతప్పి పడిపోవడంతో గాయాలు జరిగిన ఘటనలు కూడా నమోదవుతున్నాయి.

ఇది పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన మార్గం అయినప్పటికీ, ఇప్పటివరకు శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ గుంతలను వెంటనే పూడ్చి, రహదారిని పూర్తిగా మరమ్మతు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని ప్రమాదాలు జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రజల ప్రశ్న మరింత తీవ్రంగా మారుతోంది:

“ప్రమాదాలు జరిగిన తర్వాత చర్యలా? లేక ముందే పరిష్కారమా?”