BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

చింతలవల్లిలో రూ.4.02 కోట్లతో 33/11 కె.వి విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Apr, 2026 - 02:47 PM
65 వీక్షణలు

రూ.83 లక్షలతో అంతర్గత సీసీ రహదారుల ప్రారంభం

ముసునూరు మండలం, చింతలవల్లి, ఏప్రిల్ 12: రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం ముసునూరు మండలం, చింతలవల్లి గ్రామంలో రూ.4.02 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కె.వి విద్యుత్ ఉపకేంద్రానికి భూమిపూజ చేసి, శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం గ్రామంలో రూ.83 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రహదారులను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, రైతులు, నాయకులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమానికి ముందు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించగా ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మంత్రి పార్థసారథి మాట్లాడుతూ: గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన ప్రతి అభివృద్ధి పనిని దశలవారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.