చింతలవల్లిలో రూ.4.02 కోట్లతో 33/11 కె.వి విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన
రూ.83 లక్షలతో అంతర్గత సీసీ రహదారుల ప్రారంభం
ముసునూరు మండలం, చింతలవల్లి, ఏప్రిల్ 12: రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం ముసునూరు మండలం, చింతలవల్లి గ్రామంలో రూ.4.02 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కె.వి విద్యుత్ ఉపకేంద్రానికి భూమిపూజ చేసి, శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం గ్రామంలో రూ.83 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రహదారులను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, రైతులు, నాయకులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమానికి ముందు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించగా ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మంత్రి పార్థసారథి మాట్లాడుతూ: గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన ప్రతి అభివృద్ధి పనిని దశలవారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.