చిన్నారులకు ఆశీస్సులు అందించిన తన్నీరు నాగేశ్వరరావు
జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఆత్మీయ వాతావరణంలో జరిగిన నూతన వస్త్రలంకరణ వేడుకలో వైఎస్ఆర్ సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.
జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామానికి చెందిన జిల్లా యువజన విభాగ కార్యదర్శి పాల్వంచ రమేష్ బాబు – ఉమ దంపతుల కుమార్తెలు కావ్య శ్రీ, స్నేహ శ్రీల నూతన వస్త్రలంకరణ కార్యక్రమానికి హాజరైన తన్నీరు నాగేశ్వరరావు చిన్నారులకు అక్షింతలు వేసి, వారి భవిష్యత్తు సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించిన ఆయన, చిన్నారుల విద్యాభివృద్ధి, ఆయురారోగ్యాలు కలగాలని ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది.
ఈ వేడుకలో సీనియర్ నాయకులు కనపర్తి నరసింహారావు, మండల పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు దమ్మలపాటి సత్యనారాయణ, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, మండల ఉపాధ్యక్షులు బండి రాజు, మండల బీసీ సెల్ అధ్యక్షులు గుడికందుల సత్యనారాయణ, కనపర్తి బాలకృష్ణ, కొత్తపల్లి సురేష్, పట్రా రామకృష్ణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.