చిన్నంపేట మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం విజయవంతంగా అమలు
చిన్నంపేట మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం విజయవంతంగా అమలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, చిన్నంపేట మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం విజయవంతంగా కొనసాగుతోంది. ఎన్టుడే న్యూస్ జరిపిన పరిశీలనలో, ప్రధానోపాధ్యాయులు మహబు ఆధ్వర్యంలో విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ భోజనం అందించడం జరుగుతోందని తెలిపారు.
ఈరోజు పులిహార కోడిగుడ్డు మరియు గోంగూర చట్నీతో, పరిశుభ్రమైన వాతావరణంలో 43 మంది విద్యార్థులకు భోజనం అందించబడింది. మొత్తం 55 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో, అందరూ భోజన సౌకర్యం మరియు ఆహారం నాణ్యతతో సంతృప్తిగా ఉన్నారు.
మా స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి కూడా విద్యార్థులతో ముచ్చటిస్తూ, ప్రతిరోజూ పరిశుభ్రమైన మరియు పోషక భోజనం అందిస్తున్నారని విద్యార్థులు, సిబ్బంది కుదింపుగా తెలిపారు.
ప్రధానోపాధ్యాయులు మహబు పేర్కొన్నట్లు, విద్యార్థులలో భోజనం విషయంలో మనోధైర్యాన్ని పెంపొందించడం, ప్రతి ఒక్కరి పరిస్థితులను అర్ధం చేసుకోవడం లక్ష్యంగా కొనసాగుతున్నట్లు తెలిపారు.