BREAKING
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు.
www.ntodaynews.com

చిట్యాల జడ్పీ పాఠశాలలో అలరించిన భరతనాట్యం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
27 Jul, 2026 - 09:57 PM
22 వీక్షణలు

చిట్యాల జడ్పీ పాఠశాలలో అలరించిన భరతనాట్యం

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాలలో సోమవారం స్పిక్ మాకే సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ భరతనాట్య కళాకారిణి  డాక్టర్ మేఘా వెంకట్ నాట్య ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ​ఈ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ మేఘా వెంకట్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారతీయ సంప్రదాయ శాస్త్రీయ నృత్య రీతులను విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం ఆమె చేసిన భరతనాట్య ప్రదర్శన, ప్రదర్శించిన వివిధ నాట్య భంగిమలు మరియు అభినయం విద్యార్థులను ఎంతగానో అలరించి మంత్రముగ్ధులను చేశాయి. విద్యార్థులు ఈ ప్రదర్శనను ఎంతో శ్రద్ధగా తిలకించి ఆనందించారు.


​ఈ సందర్భంగా పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు  చిలుకరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ భారతీయ సాంస్కృతిక నాట్య రీతుల ప్రాముఖ్యతను మరియు వాటి విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ​ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినులు, ఉపాధ్యాయులు ఇందిర, కవిత, సుమలత, ప్రసన్న, శైలజ, మంజుల, సాదిక్, జానకి, సౌమ్య, సరళ, తిరుమల, మైముద, నవీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.