చిట్యాల జడ్పీ పాఠశాలలో అలరించిన భరతనాట్యం
చిట్యాల జడ్పీ పాఠశాలలో అలరించిన భరతనాట్యం
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాలలో సోమవారం స్పిక్ మాకే సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ భరతనాట్య కళాకారిణి డాక్టర్ మేఘా వెంకట్ నాట్య ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ మేఘా వెంకట్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారతీయ సంప్రదాయ శాస్త్రీయ నృత్య రీతులను విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం ఆమె చేసిన భరతనాట్య ప్రదర్శన, ప్రదర్శించిన వివిధ నాట్య భంగిమలు మరియు అభినయం విద్యార్థులను ఎంతగానో అలరించి మంత్రముగ్ధులను చేశాయి. విద్యార్థులు ఈ ప్రదర్శనను ఎంతో శ్రద్ధగా తిలకించి ఆనందించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు చిలుకరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ భారతీయ సాంస్కృతిక నాట్య రీతుల ప్రాముఖ్యతను మరియు వాటి విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినులు, ఉపాధ్యాయులు ఇందిర, కవిత, సుమలత, ప్రసన్న, శైలజ, మంజుల, సాదిక్, జానకి, సౌమ్య, సరళ, తిరుమల, మైముద, నవీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.